in

పెళ్లి పీటలెక్కుతాడనుకున్న కొడుకు కుప్పకూలిపోయాడు. కుటుంబానికి తీరని లోటును మిగిల్చాడు.

ఇంకొన్ని గంటల్లో పెళ్ళి, ఇంటి నిండా నవ్వులతో కిటకిటలాడుతున్న చుట్టాలు, వరుడుతో పెళ్ళి కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న వధువు,కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఇంతలో వరుడు కుప్పకూలి పోయాడు. మరుసటి రోజు కన్ను మూసాడు.
వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని రావుల శంకరయ్య చారి,భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడైన రావుల సత్యనారాయణా చారికి (34) జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువతితో ఈ శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో బిజీగా ఉన్న సత్యనారాయణా చారి ఒక్క సారిగా కుప్ప కూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఉట్నూరు లోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ పరిస్తితి విషమించడంతో అదిలాబాద్ లోని రిమ్స్ కి సత్యనారాయణా చారిని తరలించారు.అయితే అక్కడ చికిత్స పొందిన ఆయన మరుసటి రోజు గురువారం ఉదయం కన్నుమూశారు.పెళ్లి పీటలు ఎక్కుతాడనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

What do you think?

“బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కించపరిచేటట్టు లేవు”

టీిం ఇండియా బౌలర్ అర్ష్ దీప్ ఒక కొత్త చెత్త రికార్డును తన కాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో 27 పరుగులు సమర్పించుకున్నాడు.