చంద్రబాబుపై మరో కేసు వేసిన సీఐడీ. ఈ కేసులో ఏ2గా..
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ2 గా చేర్చింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఎపీఎండీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఏపీ సీఐడీ పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ2 గా, మాజీ మంత్రి పీతల సుజాతను ఏ1గా, చింతమనేని ప్రభాకర్ను ఏ3గా, దేవినేని ఉమాను ఏ4 నిందితులుగా చేర్చింది. వీళ్లు టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేశారని ఫిర్యాదులో సీఐడీ పేర్కొంది.
దీంతో ఇప్పటికే స్కిల్ స్కాం ఆరోపణలతో జైలులో ఉండి బెయిల్ మీద బయటకి చంద్రబాబుకు ఈ కేసుతో మరో ఎదురు దెబ్బ తగిలింది.