ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. చెక్ చేసుకోండిలా
ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. మీ పేరు ఆ జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి.
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అందులో మీ పేరుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు. లేదా https:eoandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఒక వేళ ఆ ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోతే ఓటరుగా నమోదు కోసం వెంటనే ఫారం-6 దరఖాస్తులను ఆన్లైన్లో లేదా నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా 2024, జనవరి 5 నాటికి ఓటర్ జాబితాలో మీ పేరు చేరుతుంది.