ఇతను లక్కీ డ్రాలో రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు
ఓ వ్యక్తి లక్కీ డ్రాలో రూ. 45 కోట్లు గెలుచుకున్నాడు. ప్రతివారం జరిగే మహ్జూజ్ డ్రాలో అదృష్టం అతన్ని వరించింది.
వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన శ్రీజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో గ్యాస్ పరిశ్రమలో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అయితే గత మూడేళ్లుగా శ్రీజు మహ్జూజ్ లక్కీ డ్రాలో పాల్గొంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన మహ్జూజ్ లక్కీడ్రాలో శ్రీజు పేరు వచ్చింది. ప్రతివారం నిర్వహించే ఈ డ్రాలో శ్రీజు రూ.45.30 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో శ్రీజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.