మేనిఫెస్టో రూపొందించనున్న టీడీపీ-జనసేన కమిటీ
తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది.
ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయ్యింది. కాగా మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తెదేపా పట్టాభి , అశోక్ బాబు, యనమల రామకృష్ణులను సభ్యులుగా నియమించగా.. జనసేన పార్టీ శరత్ కుమార్, ముత్తా శశిధర్, వరప్రసాద్ లను సభ్యులుగా నియమించింది.
ఇప్పటికే జనసేన-తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించి తెలుగుదేశం – జనసేన ఉమ్మడి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది.