in

కుమార్తె పెళ్లికి దాచిన రూ.2 లక్షలు చెదల పాలు

కుమార్తె పెళ్లికి దాచిన రూ.2 లక్షలు చెదల పాలు

కుమార్తె పెళ్ళి కోసం ఓ వ్యక్తి రూ.2 లక్షలు దాచుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ డబ్బును చెదలు, పురుగులు తినేసాయి.

వివరాల్లోకి వెళ్తే ఏపీలోని మన్యం జిల్లాలోని పుట్టూరులో ఆదిమూలం లక్ష్మణరావు అనే వ్యక్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం సుమారు రెండేళ్ల పాటు కష్టపడి రూ.2 లక్షలకు పైగా డబ్బును ట్రంక్ పెట్టెలో దాచాడు. కానీ దురదృష్టవశాత్తు ఇంతలో లక్ష్మణరావు 6 నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించాడు. లక్ష్మణరావు ఆ ట్రంక్ పెట్టె విషయం ఎవరికీ చెప్పలేదు.

దానికితోడు ఎవరూ ఆ ట్రంక్ పెట్టెను అంతగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల అతని కుటుంబం ఆ పెట్టె తెరిచి అంతా చెదలు, పురుగుల మధ్య నోట్ల ముక్కలుగా మిగిలిన రూ.2 లక్షల డబ్బును చూశారు. ఆ పరిస్తితిలో ఉన్న డబ్బును చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు.

What do you think?

పెంపుడు కుక్కలకు అంతుచిక్కని వ్యాధి

సీఎం జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు