దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు. ప్రారంభించనున్న మోదీ
దేశంలో తొలి హైస్పీడ్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అక్టోబర్ 20న రాజధాని ప్రాంతం(NCR)లో దేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రారంభించనున్నారు. గంటకు 160 కి.మీల (160 km) వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు.
దేశంలోనే తొలిసారి ఈ రైలు ఢిల్లీ- ఘజియాబాద్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య దూసుకెళ్లనుంది.