తక్కువ వడ్డీకి రూ.10 లక్షల లోన్ ఇవ్వనున్న కేంద్రం
వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుని, జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలకు సెంట్ కళ్యాణి అనే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.
ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్ లభిస్తుంది. రూ.10 లక్షల లోన్ తీసుకున్న వారు ఏడాదికి రూ.9.95 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లోను రూ.10 లక్షలు దాటితే 10.20 శాతం వడ్డీ ఉంటుంది. ఈ లోన్ పొందాలన్న ఆసక్తి ఉన్న మహిళలు సంబంధిత పత్రాలతో https:/centralbankofindia.co.in/en వెబ్సైట్కు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.