ప్రజలు ఆలోచించి ఓటువేయాలి – సీఎం కేసీఅర్
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇటీవల తొర్రూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఆ సభలో తెలంగాణా సీఎం కేసీఆర్ మాట్లాడారు. “ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయండి. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్నది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు అపేస్తుంది. ” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.