‘అనారోగ్యం పేరుతో చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతుంది’ – లోకేష్
చంద్రబాబును అనారోగ్యం పేరుతో చంపే కుట్ర జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. ఆయనకు ఏ హాని జరిగినా జగన్ దే బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అనారోగ్యం పై టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అనారోగ్యం పేరుతో తెదేపా అధినేత చంద్రబాబును చంపే కుట్ర జరుగుతోందని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబును రిమాండ్లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని.. ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. జగన్ సర్కార్దే బాధ్యత. ఆయన పై ఎందుకీ కక్ష? ” అంటూ ప్రశ్నించారు.