in ,

ఇండియాను ఓడిస్తే ఆ ఆటగాడితో డేట్ కు వెళ్తా – పాక్ నటి షిన్వారి

ఇండియాను ఓడిస్తే ఆ ఆటగాడితో డేట్ కు వెళ్తా – పాక్ నటి షిన్వారి

పాక్ నటి సెహర్ షిన్వారి రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే ఆటగాడితో డిన్నర్ డేట్‌కు వెళ్తానని ప్రకటించింది.

గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రేపు జరగబోయే మ్యాచ్ పై పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారి సంచలన ప్రకటన చేసింది. గతంలోనూ ఇలాంటి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన ఆమె ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే.. ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ డేట్‌ చేస్తా అని ఆమె వ్యాఖ్యలు చేసింది.

“భగవంతుడా ఇండియా జట్టును బాంగ్లాదేశ్ ఓడిస్తే ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ చేస్తా” అంటూ షిన్వారి ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

What do you think?

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

కలకలం సృష్టిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్. గాలి ద్వారా వ్యాప్తి