భారత్ అక్కడ ఆడ బోవడం లేదు. పాక్ లేకుండానే మ్యాచలు..
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ నిర్వహణకు అడుగులు పడుతుతున్నాయట. పాక్ కు ప్రత్యామ్నాయ వేదికల్లో ఆసియా కప్ నిర్వహణకు ఏసీసీ ప్లాన్ చేస్తోందట.
వివరాల్లోకి వెళ్తే ఈ సారి ఆసియా కప్ నిర్వహణకు పాక్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కి భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ తెలిపింది. దీంతో హైబ్రిడ్ మోడల్కు పీసీబీ ప్రతిపాదించింది. ఇతర జట్లు పాక్లో, భారత్ జట్టు మాత్రం మ్యాచ్లు దుబాయ్లో ఆడేలా ప్లాన్ చేసింది.
అయితే ఈ సమయానికి దుబాయ్లో వేడి ఎక్కువగా ఉంటుందని ఆటగాళ్లు తట్టుకోలేరని బీసీసీఐ ఏసీసీకి చెప్పిందట. దీంతో పాక్ లేకుండానే ప్రత్యామ్నాయ వేదికల్లో ఆసియా కప్ నకు ఏసీసీ ప్లాన్ చేస్తోందట.