టెండూల్కర్ ను నేషనల్ ఐకాన్ గా నియమించనున్న ఎన్నికల కమిషన్
సచిన్ టెండూల్కర్ ను నేషనల్ ఐకాన్ గా ఎన్నికల కమిషన్ నియమించనుంది. ఈ బుధవారం దీనిపై ఒప్పందం చేసుకోనుంది.
వివరాల్లోకి వెళ్తే 2024 లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహిస్తారని తెలిపిన ఈసీ అనేక రంగాలకు చెందిన మేటి వ్యక్తుల్ని నేషనల్ ఐకాన్స్ గా తమ ప్రచారం కోసం నియమించుకుంటోంది. గతంలో ఎంఎస్ ధోనీ, అమీర్ ఖాన్, మేరీ కోమ్ లను వినియోగించుకుంది.
ఇప్పుడు తాజాగా 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను నేషనల్ ఐకాన్ గా ఎన్నికల కమిషన్ నియమించనుందని తెలుస్తోంది. దీనిపై ఈ బుధవారం ఒప్పందం కూడా చేసుకోనుంది.