బీసీసీఐకి విరాట్ లేఖ
ఐపీఎల్: ఐపీఎల్ లో ఆర్సిబి – ఎల్సిజి కి జరిగిన మ్యాచ్ లో విరాట్ – గంభీర్ కి, విరాట్ – నవీనుల్ కి మధ్య జరిగిన గొడవ ఎంత దుమారం లేపిందో అందరికీ తెలిసిన విషయమే. దీని కారణంగా విరాట్, గంభీర్ లకు వంద శాతం మ్యాచ్ ఫీజ్ ను, నావీనుల్ కు 50 శాతం మ్యాచ్ ఫీజ్ ను కోత విధించగా, విరాట్ తరుపున ఆర్సిబి కి 1.07 కోట్ల రూపాయల కూడా జరిమానా విధించారు. అయితే ఈ విషయంపై స్పందించిన విరాట్ వంద శాతం ఫీజ్ కోత పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐ అధికారులకు లేఖ రాశాడు.
తాను ఉద్దేశపూర్వంగా ఎవరితోనూ గొడవ పడలేదని.. ముందు నవీనుల్, తర్వాత గంభీర్ తనతో గొడవ పెట్టుకున్నారని.. వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించేంత తప్పు తాను చేయలేదని విరాట్ ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా బీసీసీఐ నుండి స్పందన రావాల్సి ఉంది.