పీఈసెట్ ధరకాస్తు గడువు పెంపు
తెలంగాణ బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ధరకాస్తుకు గడువును పొడిగించినట్టు అధికారులు అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్టు తెలిపారు.
మార్చి 13వ తేదీన విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు జరుగుతుందని తొలుత ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ధరకాస్తు తేదీని ఇప్పుడు మే 16వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 26వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని, జూన్ మూడో వారంలో ఫలితాలు రిలీజ్ అవుతాయని అధికారులు తెలిపారు.
ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, మిగతా కేటగిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. రూ. 5 వేల ఆలస్య రుసుం మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.