మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెలలోనే ఎంసెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయని వెల్లడించారు.
ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలను దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారిలో ఒక్క హైదరాబాద్లోనే 1.71 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. తెలంగాణలో 104, ఏపీలో 33 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ నెల 10 నుంచి 14 వరకు ఈ పరీక్షలు కొనసాగాయి.
అయితే తాజాగా తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 25 తేదీ ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ హైదరాబాద్లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నట్టు ఆమె తెలిపారు.