డ్రగ్స్ కోసం సొంత బిడ్డల్ని అమ్ముకున్న దంపతులు
డ్రగ్స్ మత్తులో పడి ఇద్దరు దంపతులు సొంత బిడ్డల్నే అమ్ముకున్నారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర రాజధాని ముంబై కు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్కు బానిసలయ్యారు. ఈ క్రమంలో డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో మొదట రూ.60,000 కు రెండేళ్ల బాబును , అనంతరం నెల రోజుల బాబును రూ.14,000 కు షకీల్ మక్రానీ అనే వ్యక్తికి అమ్ముకున్నారు.
అయితే ఈ విషయం షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు తెలిసింది. దీంతో రుబీనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి షకీల్ మక్రానీని, డ్రగ్స్ ఏజెంట్ ను అరెస్ట్ చేశారు.