in

రూ.16 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. నెలకి రూ.5.6 లక్షలు..

రూ.16 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. నెలకి రూ.5.6 లక్షలు..

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్ 5 గ్రాండ్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో రూ.16 కోట్ల లాటరీ అతన్ని వరించింది.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ అనే వ్యక్తి అంబూర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తుండగా 2019లో సౌదీ అరేబియాలో జాబ్ వచ్చింది. అయితే మాగేష్‌కు మొదటి నుంచి లాటరీలపై ఆసక్తి ఎక్కువ ఉండేది. అలా ఓ సారి కొన్న ఒక లాటరీపై ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్ 5 గ్రాండ్ ప్రైజ్ అతన్ని వరించింది.

దీంతో 25 ఏళ్ల పాటు ప్రతి నెల సుమారు రూ.5.6 లక్షలు అతనికి లభించనుంది. ఈ విషయం తెలుసుకున్న మాగేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

What do you think?

గుండె పోటని నాటకమాడి 20 రెస్టారెంట్లకు టోపీ

“మర్మాణువు” కోసం క్రౌడ్ ఫండింగ్. వెంకటేష్ మహా..