‘ఆదిపురుష్’ కేసులపై విచారణ అనవసరం – సుప్రీం కోర్టు
‘ఆదిపురుష్’ సినిమాపై సుప్రీం కోర్టు అన్ని కేసులను కొట్టివేసింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చాక.. ఇక విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.
‘ఆదిపురుష్’ విడుదల అయినప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ రకరకాల వివాదాలు నడిచాయి. రామాయణాన్ని తప్పుగా తెరకెక్కించారని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కొందరు రోడ్డెక్కితే.. ఇంకొందరు మన పురాణ ఇతిహాసాలను అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని కోర్టు మెట్లెక్కారు. దీంతో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల పాటు దుమారం రేపింది.
అయితే తాజాగా ఈ సినిమాపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చాక.. ఈ వివాదంపై విచారణ అనవసరం అని అభిప్రాయపడింది. దీనిపై వివిధ కోర్టులలో జరుగుతున్న కేసులు కూడా కొనసాగడం అనవసరం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.