సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాతకు గుండెపోటు
ప్రముఖ నిర్మాత విజయ్ జాగర్లమూడి ఆసుపత్రి పాలయ్యారు. ఆయన నిర్మించిన సినిమా విడుదల కాకపోవడంతో గుండెపోటుకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే నిర్మాత విజయ్ జాగర్లమూడి స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా ‘ఖుదీరామ్ బోస్’ అనే సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ ఖుదీరామ్ బోస్ సినిమాను ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా అక్కడ మంచి స్పందన వచ్చింది.
దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని విజయ్ జాగర్లమూడి ఆశించారు. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. దీంతో ఆవేదనకు గురైన ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.