మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ తెలుగు సినీ పరిశ్రమలో తొలి సారి అడుగు పెట్టనున్నారు.
2017లో “మిస్ వరల్డ్ ” కిరీటం దక్కించుకున్న ఈ నార్త్ భామ 2022 లో అక్షయ్ కుమార్ “సామ్రాట్ పృథ్వీరాజ్” సినిమా ద్వారా బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు తెరపై కూడా త్వరలో కనిపించబోతున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా, యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ విషయాన్నే ఆ చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా అని, ఇందులో వరుణ్ తేజ్ భారతీయ వైమానిక దళ పైలట్ గా, రాడార్ అఫీసర్గా మానుషీ కనిపిస్తారని చిత్ర బృందం తెలిపింది. దేశ భక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్ళను చూపిస్తామని చిత్రబృందం పేర్కొంది.
ఇక ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినై సన్స్ పిక్చర్స్ సంస్థలపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మిస్తున్నారు.