in ,

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఈ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

సంగీత దర్శకుడు కోటితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన రాజ్, 1983 లో ప్రళయ గర్జన సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కోటితో కలిసి స్వరాలు సమకూర్చి మొదటి సారిగా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు.

అలా కొద్ది కాలంలోనే మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకులుగా ఈ కోటి రాజ్ ద్వయం మారింది.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయి విడి విడిగా సినిమాలు చేసుకున్నారు.

రాజ్ ఈ ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించి టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

What do you think?

మెడికో ప్రీతి సోదరికి హెచ్ఎండీఏలో ఉద్యోగం!

రూ.2 వేల నోట్ల మార్పిడి పై ఎస్బీఐ తీపికబురు!