in ,

నెపోటిజం పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.

నెపోటిజం పై హీరో నాని, రానాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “నిజం” షోలో నెపోటిజం పై వారి అభిప్రాయాలను తెలిపారు.

ప్రముఖ గాయని స్మిత సోనీ లివ్ (Sony liv) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో “నిజం” అనే టాక్ షో ఒకటి చేస్తున్నారు. ఈ షోకి హీరో నాని, రానాలు అతిధులుగా హాజరయ్యారు.

ఆయితే ఈ షోలో మాటలో మాటగా స్మిత నెపోటిజం గురించి అడగగా.. వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని మాట్లాతూ “నా మొదటి సినిమా విడుదలైనప్పుడు లక్ష మంది చూశారు. చరణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కోటి మంది చూశారు. అలా చూసిన వాళ్ళు కదా నెపోటిజాన్ని ప్రోస్తాహిస్తుంది.” అన్నారు. రానా మాట్లడుతూ ” తల్లిదండ్రులు వారసత్వాన్ని పిల్లలు నిలబెట్టాలి. వాళ్లు నిర్మించిన దాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలి. ఒకవేళ అలా చేయకపోతే పిల్లలు తప్పు చేసినట్టు అవుతుంది.” అంటూ నెపోటిజం పై తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇక ప్రస్తుతం నాని “దసరా” సినిమా విజయాన్ని ఆనందిస్తున్నారు. రానా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “జవాన్” సినిమాతో బిజీగా ఉండగా.. వీరు అతిధులుగా హాజరైన “నిజం” టాక్ షో పూర్తి ఎపిసోడ్ని సోనీ లైవ్ లో చూడొచ్చు.

What do you think?

హైదరాబాద్ లో కలకలం. ముగ్గురు బాలికలు మిస్సింగ్..

రూ. 74 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.