హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులకు పిర్యాదు చేయడంతో వారిని వెతికి కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన స్వప్న, ప్రమీల, హసీనా అనే ముగ్గురు బాలికలు బర్త్ డే వేడుకలు ఉన్నాయని, త్వరగా తిరిగి వచ్చేస్తామని చెప్పి మంగళవారం ఫిబ్రవరి 21 రాత్రి బర్త్ డే పార్టీకి వెళ్లారు. అయితే అలా వెళ్లిన వాళ్ళు ఎంత సమయానికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం కూడా వారు ఇంటికి చేరకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఐనా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాధ్యమైనంత త్వరగా ముగ్గురు పిల్లల్ని వెతికి కనిపెడతామని తెలిపారు.