in

మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు కోల్పోయాడు

మద్యం మత్తులో బాంబు కొరికి ప్రాణాలు కోల్పోయాడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి బాంబును నోటితో కొరికి పేలుడుకి కారణమయ్యాడు. ఈ దుర్ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే చిత్తూరులోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెలో చిరంజీవి అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతని ప్రవర్తనతో విసిగిపోయిన అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

కాగా అతను అడవి జంతువులను తరమడానికి ఉపయోగించే నాటు బాంబులలో ఒక బాంబును మద్యం మత్తులో కొరికాడు. దీంతో పెద్ద పేలుడు సంభవించగా.. చిరంజీవి తల ముక్కలైపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What do you think?

అరుదైన ఘనతను నమోదు చేసిన రోహిత్ శర్మ. 53 సిక్స్‌లు

మిస్టరీగా మిగిలిపోయిన జోడియాక్ కిల్లర్. ఆ లెటర్స్ వెనుక ఉన్న మొహం ఎవరిది?