నెలాఖరులోగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల – ఏపీ ప్రభుత్వం
త్వరలో జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని పబ్లిక్ సర్వీస్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా (2024, నవంబర్) జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.