అతను అమ్మే నెయ్యి కిలో 2 లక్షల రూపాయలు
ఓ వ్యక్తి అమ్మే నెయ్యి కిలో ఏకంగా రూ.2 లక్షల అమ్ముడు పోతోంది. అతను తయారు చేసే ఒక కిలో నెయ్యికి దాదాపు 31 లీటర్ల పాలు కావల్సి వస్తుంది.
వివరాల్లోకి వెళ్తే గుజరాత్ కు చెందిన గోండాల్లో రమేష్భాయ్ రూపరేలియా అనే రైతు ఆవుపాలతో నెయ్యిని చేసి దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఆ నెయ్యిలో పసుపు, కుంకుమ పువ్వు, గులాబీ రేకులు, మందారాలు, పిప్పళ్లు ఇలా రకరకాల మూలికల్ని కలుపుతాడు.
కాగా ఒక కిలో నెయ్యి చెయ్యడానికి దాదాపు 31 లీటర్ల పాలు కావాలి. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఆ నెయ్యి అంత రేటు పలుకుతుంది. దీంతో ఆయన ఒక కిలో నెయ్యి రేటు దాదాపు రూ.2 లక్షల దాకా ఉంటుంది.