సీఎం జగన్ పై విరుచుకుపడ్డ తెదేపా నేత వెంకటరమణారెడ్డి
ఏపీ సీఎం జగన్ పై తెదేపా నేత వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
‘భారతి సిమెంట్స్ సంస్థలో రూ.4 వేల కోట్ల షేర్లు ఉన్న సీఎం జగన్ పేదవాడు.. మేము పెత్తందారులమా?” అని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. భారతి సిమెంట్స్ లో ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని ఆనం ఆరోపించారు. తనకు ఆస్తి ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్లో చెప్పారని గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా.. తాను పేదవాడినంటూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు.