వైద్యశాస్త్రంలో కరికో, డ్రూ వెయిస్ లకు నోబెల్ ప్రైజ్
కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ లను నోబెల్ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని ఆ నోబెల్ బృందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ కు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం-2023 వరించింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు వారికి ఈ నోబెల్ అవార్డు లభించింది.