in ,

త్రివిక్రమ్-మెగాస్టార్ కాంబో? ‘ఖైదీ’ సీక్వెల్..

త్రివిక్రమ్-మెగాస్టార్ కాంబో? ‘ఖైదీ’ సీక్వెల్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోందట. ఇది ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

త్రివిక్రమ్, చిరంజీవి నటించిన “జై చిరంజీవ” సినిమాకు మాటలు అందించారు. అది తప్ప వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరు కలవబోతున్నారట. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా సీక్వెల్ కోసం వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేయనున్నారట. ‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం’ అనే డైలాగుతో ‘ఖైదీ’ సినిమా ముగుస్తుంది. ఇప్పుడు అదే లైన్ను స్టోరీగా తీసుకుని త్రివిక్రమ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చిరంజీవి కూడా ఈ సీక్వెల్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి “బింబిసార” దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమాతో బిజీగా త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఆ తరువాత త్రివిక్రమ్, బన్నీ సినిమా లైన్ లో ఉంది. కాగా మహేష్ సినిమా పూర్తై బన్నీ సినిమా మొదలు పెట్టే గ్యాప్ లో మెగాస్టార్ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

What do you think?

కేసీఆర్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు. ప్రజలు మెచ్చిన వారే..

36 గంటల పాటు సముద్రంలో తేలి చావును ఎదిరించాడు.