వివాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్
మెగా హీరో సాయిధరమ్ తేజ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన ఓ పని వివాదాస్పదంగా మారింది.
ఇటీవల సాయిధరమ్ తేజ్ శ్రీ కాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో అక్కడి సుబ్రమణ్య స్వామికి ఆయన స్వయంగా హారతి ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం కేవలం అర్చకులు మాత్రమే స్వామివారికి హారతి ఇవ్వాలి. దీంతో ఆయన చేసిన ఈ పనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సాయిధరమ్ తేజ్ ఈ విషయం పై ఇంకా స్పందించాల్సి ఉంది.