in ,

“ది కేరళ స్టోరీ”  సినిమాపై స్పందించిన ఆర్జీవీ.. 

“ది కేరళ స్టోరీ”  సినిమాపై స్పందించిన ఆర్జీవీ.. 

 

ఇటీవల విడుదలైన “ది కేరళ స్టోరీ” సినిమా ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై దర్శకుడు ఆర్జీవీ కూడా స్పందించారు. “ఇది అసలైన పాన్ ఇండియా సినిమా” అంటూ ప్రశంసించారు.

 

2018-19లో దాదాపు 32 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. వారు ఎక్కడున్నారు ?ఏమైపోయారు ? అన్న విషయం ఎవరికీ తెలియదు. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కథనే “ది కేరళ స్టోరీ” గా వెండితెరపైకి తీసుకువచ్చారు డైరెక్టర్ సుదీప్తోసేన్. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

అయితే ఒక వైపు నిజజీవితంలో అమ్మాయిలకు జరిగే విషయాలనే ఈ సినిమాలో చూపించారని కొందరు మెచ్చుకుంటుండగా.. మరో వైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

అందరూ సినిమాపై వారి భావను తెలియ చేస్తుండగా.. దర్శకుడు ఆర్జీవీ కూడా ఈ సినిమాపై స్పందించారు. “తమిళ్/ మలయాళీ అమ్మాయి హీరోయిన్. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే ” అంటూ ఆర్జీవీ ట్విట్టర్ లో “ది కేరళ స్టోరీ”ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

What do you think?

మన మనిషి.. మంచిమనిషి …ఎమ్మెల్యే కేతిరెడ్డి

“ఎర్రి పప్ప”కి కొత్త అర్థం చెప్పిన మంత్రి కారుమూరి