in , ,

తొలి మ్యాచ్తోనే అధరగొట్టిన తెలుగు వారియర్స్!

తెలుగు వారియర్స్ మొదటి మ్యాచ్తోనే అదరగొట్టింది. తొలి మ్యాచులోనే అధ్బుతమైన ప్రదర్శన కనపరిచి కేరళా స్ట్రైకర్స్ ను ఓడించింది. సిసిఎల్ కప్ గెలిచే ప్రయాణంలో తొలి అడుగు వేసింది.

తెలుగు వారియర్స్ కు, కేరళా స్ట్రైకర్స్ కు జరిగిన సిసిఎల్ మొదటి మ్యాచ్లో అఖిల్ నాయకత్వంలో తెలుగు వారియర్స్ అద్భుతమైన ప్రదర్శన కనపరించింది. కేరళా స్ట్రైకర్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయి ఆడగా.. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఆశ్చర్యపరిచారు. యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు. మొదట బ్యాటింగ్ దిగిన తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
లకష్య ఛేదనకు దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. యువ హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశారు.

అత్యధిక పరుగులు చేసినందుకు అక్కినేని అఖిల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ను అందచేశారు. ఇక అఖిల్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్న విడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

What do you think?

ప్రముఖ సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి.

దాదాసాహెబ్ పాల్కే అందుకున్న రన్బీర్ కపూర్.