in ,

దాదాసాహెబ్ పాల్కే అందుకున్న రన్బీర్ కపూర్.

బాలీవుడ యంగ్ హీరో రన్బీర్ కపూర్ దాదాసాహెబ్ పాల్కే ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 20న జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆయన సతీమణి ఆలియాభట్ ఈ అవార్డును అందుకున్నారు.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా “దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్” అట్టహాసంగా జరిగింది. ఫిబ్రవరి 20న జరిగిన చోటు చేసుకున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 మంచి ప్రతిభ చూపిన నటులకు అవార్డులను అందచేశారు. ఇక “బ్రహ్మాస్త్ర” సినిమాతో అలరించిన ప్రముఖ బాలీవుడ్ యువనటుడు రన్బీర్ కపూర్ ను ఉత్తమ నటుడి అవార్డ్ తో సత్కరించారు. ఐతే కొన్ని కారణాల వల్ల రన్బీర్ కపూర్ హాజరు కాలేకపోవడంతో ఆయన భార్య, నటి అయిన ఆలియాభట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరై ఈ అవార్డును అందుకున్నారు.

రన్బీర్ తో పాటు చాలా మంది ఇతర బాలీవుడ్ నటులు కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులను అందుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా వరుణ్ ధావన్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గా అనుపమ్ ఖేర్ అవార్డులను అందుకున్నారు.

What do you think?

తొలి మ్యాచ్తోనే అధరగొట్టిన తెలుగు వారియర్స్!

హైదరాబాద్ లో కలకలం. ముగ్గురు బాలికలు మిస్సింగ్..