నితీష్ తివారి రామాయణంలో సీతగా సాయి పల్లవి?
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి రామాయణం తెరకెక్కించబోతున్నట్లు ఇతవరుకే తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటించబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి.
రణబీర్కపూర్ రాముడిగా, అలియాభట్ సీతగా రామాయణం తెరకెక్కబోతన్నట్లు గతంలో నితీష్ తివారి తెలిపారు. ఈ సినిమాను అల్లు అరవింద్, మధు మంతెన భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే తాజాగా అలియాభట్ ఈ సినిమాలో నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేకపోయారని.. దీంతో అలియా స్థానంలో సాయిపల్లవిని హీరోయిన్గా ఎంపిక చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వార్త ఎంత వరకు నిజమో ఇంకా తెలీదు కానీ, సాయి పల్లవి అభిమానుల ఆనందానికి మాత్రం అవదులు లేకుండా పోయాయి.