in

“బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కించపరిచేటట్టు లేవు”

ఇటీవల హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన “వీర సింహా రెడ్డి” విజయోత్సవ వేడుక జరిగింది. అయితే ఈ విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ అక్కినేని నాగేశ్వర రావు,ఎస్వీ రంగా రావులపై కొన్ని కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై సోషల్ మీడియాలో మీమ్ ల రూపంలో మరియు వీడియోల రూపంలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మరో పక్క ఈ వ్యాఖ్యలపై అక్కినేని వారసులు స్పందించారు. “నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు వారిని అగౌరవ పరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడమే” అంటూ అక్కినేని అఖిల్, నాగ చైతన్యలు ట్వీట్లతో స్పందించారు.
ఇదిలా ఉండగా ఈ విషయంపై ఎస్వీ రంగారావు గారి మనవళ్ళు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) కూడా ఒక విడియో ద్వారా స్పందించారు. అయితే వారి వ్యాఖ్యలు అక్కినేని వారికి పూర్తి వ్యతిరేకంగా ఉండడం విశేషం. “నందమూరి వారికి మాకు మంచి అనుబంధం ఉంది. “వీర సింహా రెడ్డి” విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ గారు తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి సాధారణ పోకడలో మాట్లాడారు తప్ప ఆ వ్యాఖ్యలు చేయడంలో ఎటువంటి దురుద్దేశము ఉన్నటు మాకు అనిపించలేదు. మాకు ఆ విషయంలో ఎటువంటి వివాదం కనిపించడం లేదు. దయచేసి ఈ వ్యాఖ్యలను వక్రీకరించి ట్రోల్స్ వేసి మా మధ్య అనుబంధాన్ని చెడగొట్టొద్దు” అంటూ ఎస్వీ రంగారావు గారి మనవళ్ళు విజ్ఞప్తి చేశారు.
అయితే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలీదు కానీ మీడియాలో ట్రోల్స్ మాత్రం అడ్డు,అదుపు లేకుండా వస్తున్నాయి.

What do you think?

మోదీ గొప్ప నాయకుడని, భారత్ ను సంమర్ధవంతంగా పాలిస్తున్నారని పాక్ పత్రికలు మెచ్చుకుంటున్నాయి. మోదీ ఏం చేశారంటే..

పెళ్లి పీటలెక్కుతాడనుకున్న కొడుకు కుప్పకూలిపోయాడు. కుటుంబానికి తీరని లోటును మిగిల్చాడు.