సీఎం జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు
జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్ కు బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఈ మేరకు సీబీఐ సహా, జగన్కు కేసు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. కాగా గత పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.