in

పంది గుండెతో సర్జరీ చేయించుకున్న వ్యక్తి మృతి

పంది గుండెతో సర్జరీ చేయించుకున్న వ్యక్తి మృతి

ఓ వ్యక్తి వైద్యులు సర్జరీ చేసి పంది గుండెను అమర్చారు. కానీ దురదృష్టవశాత్తు అది సహకరించక పోవడంతో అతను మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది సెప్టెంబర్ లో యూఎస్ (us) కు చెందిన లారెన్స్ ఫాసెట్ అనే వ్యక్తికి వైద్యులు సర్జరీ చేసి పంది గుండెను అమర్చారు. కానీ నెల రోజులు బాగానే పనిచేసిన ఆ పంది గుండె, తర్వాత సహకరించడం నెమ్మదిగా ఆపేయడంతో పిగ్ హార్ట్ తో సర్జరీ చేయించుకున్న వ్యక్తి 40 రోజుల తర్వాత మరణించాడు.

అయితే గతంలో తొలిసారిగా ఇంకో వ్యక్తికి ఇలాగే పంది గుండెను అమర్చారు. అతను కూడా 2 నెలల తర్వాత చనిపోయాడు. అదే విధంగా ఈ సర్జరీ చేయించుకున్న రెండో వ్యక్తి లారెన్స్ కూడా ఇప్పుడు మరణించాడు.

What do you think?

ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. చెక్ చేసుకోండిలా

మరో అరుదైన రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ