చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి
ఓ చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి. కానీ ఆ తరువాత వాటిని పరీక్షించగా అవి నకిలీవని తేలింది.
వివరాల్లోకి వెళ్తే ఇటీవల సల్మాన్ షేక్ అనే ఓ చెత్త ఏరుకునే వ్యక్తికి బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా అతనికి 23 అమెరికన్ డాలర్ల కట్టలు కనిపించాయి. అతడి యజమాని నుంచి, ఆ తరువాత ఓ సామాజిక కార్యకర్త ద్వారా ఈ వ్యవహారం బెంగళూరు పోలీసులకు తెలిసింది. ఈ మొత్తం విలువ రూ. 25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అవి ఒరిజినల్ డాలర్లేనా? లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని పోలీసులు ఆర్బీఐకి పంపించారు. అక్కడ ఆర్బీఐలో అవి నకిలీవని తేలింది.