in ,

100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం – భాజపా సభ్యుడు కిరోడి లాల్

100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం – భాజపా సభ్యుడు కిరోడి లాల్

కిరోడి లాల్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం దాచి ఉంచారని ఆరోపించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ భాజపా రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపుర్లో ఉన్న ఓ భవనంలోని 100 ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనంతో పాటు 50 కిలోల బంగారం దాచి ఉంచారని ఆరోపించారు. పోలీసులు వచ్చి వాటిని తెరవాలని కిరోడి లాల్ డిమాండ్ చేశారు.

అయితే, ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను మాత్రం ఆయన బయట పెట్టలేదు. పోలీసులు వచ్చి లాకర్లను తెరిచే వరకు తాను అక్కడే కూర్చొని ఉంటానని కిరోడి లాల్ మీనా అన్నారు.

What do you think?

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం. ఎన్నో ఏళ్ల తర్వాత రింగ్ ఆఫ్ ఫైర్..

‘అనారోగ్యం పేరుతో చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతుంది’ -లోకేష్