అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.70లక్షల బంగారం స్వాధీనం
1,179 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర రూ.70,02,568 గా ఉంటుందని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే నవంబర్ 9 నుంచి 13 మధ్య ఇండిగో ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి మంగళూరుకు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను అడ్డుకున్నారు. వారి ట్రాలీ బ్యాగ్లో బీడింగ్ రాడ్ల రూపంలో ఉన్న 21.6 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో గత 10 రోజుల్లో 1,179 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీటి ధర రూ.70,02,568 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు.