“2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్” – కేంద్రం
భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు అంతరిక్ష విభాగానికి ఆయన సూచనలు చేశారని పేర్కొంది.
2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 2040 కల్లా చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
అంతరిక్ష విభాగానికి ఆయన సూచనలు చేశారని.. ఈ మేరకు త్వరలోనే ఓ రోడ్ మ్యాప్ ను అంతరిక్ష శాఖ సిద్ధం చేస్తుందని వెల్లడించింది. మార్స్, వీనస్ గ్రహాలపైకి మిషన్లపైనా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చినట్లు తెలిపింది.