ఆ గ్రామంలో ఉండేది 11 మందే.. ఓట్లు ఉన్నది ఐదుగురికే..
ఛత్తీస్గఢ్లోని భరత్పూర్ సోన్హత్లోని శేరాడాండ్ గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పోలింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది.
దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామంలో కేవలం మూడు ఇళ్లు మాత్రమే ఉంటాయట. మొత్తంగా 11 మంది నివసిస్తుంటారట. ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. మొత్తంగా అయిదుగురికి మాత్రమే ఓటు హక్కు ఉందట. వీరిలో ఓ జంట తొలిసారిగా ఓటు వేయనున్నారట.