కలకలం సృష్టిస్తున్న ఇన్ఫ్లూయెంజా వైరస్. గాలి ద్వారా వ్యాప్తి
ఆదిలాబాద్ జిల్లాలో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 104 ఇన్ఫ్లూయెంజా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీని బాధితులు 10 రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా ఈ వైరస్ సోకుతోంది.
ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియక అందరూ భయాందోళనకు గురవుతున్నారు.