ప్రజల గుండెల్లో గుబులు పుట్టించి, రెండేళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యేలా జీవితాలను స్తంభింప చేసిన మహమ్మారి కరోనా. ఈ కరోనా వైరస్ పుట్టుకకు చైనానే కారణమని చాలా దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయమే మరో సారి ప్రస్థావనలోకి వచ్చింది.
చైనాలో ప్రభుత్వాధీనంలో ఉన్న వూహాన్ ల్యాబ్ నుంచే ఈ కరోనా వైరస్ పుట్టి ఉంటుందని తమ పరిశీలనలో తేలిందని FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రే బహిరంగంగా వ్యాఖ్యానించారు.
అయితే మరో వైపు రాజకీయ కక్షతోనే అమెరికా తమపై ఆరోపణలు చేస్తోందని, వారి వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఇతర అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఈ వైరస్ పుట్టుక సహజంగానే జరిగి ఉండొచ్చని భావిస్తున్నాయి.