ఏపీ గ్రూప్1,గ్రూప్2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే ఆంద్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల 73కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 1000 పోస్టుల భర్తీకి నోటిఫకేషన్ త్వరలో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.
గ్రూప్ 1 లో 100 కు పైగా పోస్టులు, గ్రూప్ 2 లో 900 కు పైగా పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలుస్తుంది. కాగా, ఈ పోస్టుల భర్తీకి సంభందించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.