వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల. నిరాశలో అభిమానులు
2023 వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఇండియాలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుందని తెలిపింది.
ఈ టోర్నీలో మూడు మ్యాచ్లకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్లు పాకిస్తాన్వి ఉండగా.. ఇంకో మ్యాచ్లో న్యూజిలాండ్ ఆడనుంది. ఈ జట్లకు పోటీగా శ్రీలంక, జింబాబ్వే జట్లు ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే భారత్ మాత్రం హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడబోవడం లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. భారత్ హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.