డబ్ల్యూటీసీకి సిద్దమౌతున్న టీమ్ ఇండియా..!
ఇటీవల ఐపీఎల్ ఆడి ముగించుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ఆడేందుకు సిద్దమౌతోంది.
ఈ టోర్ని జూన్ 7 నుంచి మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇపీఎల్ ముగించుకున్న టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా ఇంగ్లండ్కు వెళ్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ మంగళవారం (మే 30) లండన్ చేరుకున్నారు. ఇప్పటికే టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ
ఫైనల్ కోసం వీరు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసారు.
ఇక ఐపీఎల్ ఫైనల్ అడిన గిల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, కేఎస్ భరత్లు ఈ గురువారం (జూన్ 1) జట్టుతో కలవనున్నారు.