in ,

టీ20 సీరీస్‌ తో సీఎస్కే బౌలర్ తుషార్ డెబ్యూ!

టీ20 సీరీస్‌ తో సీఎస్కే బౌలర్ తుషార్  డెబ్యూ!

 

సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్‌పాండే టీ20 సిరీస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఐపీఎల్ లో అదరగొట్టిన తుషార్ కు ఈ అవకాశం కల్పించాలని బీసీసీఐ యోచిస్తోందట.

ఇప్పటికే యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్‌లు టీ20 సిరీస్ తో డెబ్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తుషార్ దేశ్‌పాండే కూడా చేరబోతున్నట్లు సమాచారం. సీనియర్ పేసర్లు మహ్మద్ సిరాజ్‌, మహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో త్వరలో జరగబోయే భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ తో సిరాజ్‌, షమీల స్థానంలో 2023 ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టిన తుషార్‌ దేశ్‌పాండేను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2023 ఐపీఎల్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన తుషార్ 21 వికెట్లు పడగొట్టాడు.

What do you think?

‘ఆదిపురుష్’ హిందువులపై విదేశీ కుట్ర

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 31 మంది మృతి