టీ20 సీరీస్ తో సీఎస్కే బౌలర్ తుషార్ డెబ్యూ!
సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్పాండే టీ20 సిరీస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఐపీఎల్ లో అదరగొట్టిన తుషార్ కు ఈ అవకాశం కల్పించాలని బీసీసీఐ యోచిస్తోందట.
ఇప్పటికే యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్లు టీ20 సిరీస్ తో డెబ్యూ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తుషార్ దేశ్పాండే కూడా చేరబోతున్నట్లు సమాచారం. సీనియర్ పేసర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో త్వరలో జరగబోయే భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ తో సిరాజ్, షమీల స్థానంలో 2023 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన తుషార్ దేశ్పాండేను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
2023 ఐపీఎల్ మొత్తం 16 మ్యాచ్లు ఆడిన తుషార్ 21 వికెట్లు పడగొట్టాడు.