చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 31 మంది మృతి
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన యించువాన్ నగరంలోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కొంతమంది చనిపోగా ఇంకొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్లు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని 31 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా తెలిపింది. కాగా ప్రమాదం జరగడానికి గల కారణం తెలుసుకునే పనిలోనే ఉన్నామని అధికారులు తెలిపారు.